ఓపిగ్గా కూర్చునే శక్తి లేదు.. నడుం వాలుద్దామంటే స్థలం చాలదు. ఆటోనే అంబులెన్స్ చేసుకుని ఓ వృద్ధుడు సుమారు 120 కి.మీ. దూరం ప్రయాణిస్తున్నారు. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాల్సిన రమణయ్య (60) దీనావస్థ ఇది. లాక్డౌన్ వల్ల బస్సులు లేక ఆటోలో కడప జిల్లా రాజంపేట నుంచి తిరుపతి స్విమ్స్కు ఆయన వస్తున్నారు. దీని కోసం రోజూ ఆటోకు రూ.1500 ఖర్చవుతోందని వాపోయారు. ఇతర ఖర్చులు అదనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.