ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 2, 2021, 8:24 PM IST

ETV Bharat / state

కొవిడ్ బాధితులకు కావలసిన వసతులు కల్పించండి: ఎంపీ అవినాశ్

కొవిడ్ బాధితులకు కావలసిన వసతులన్నింటిని కల్పించాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. కడప నగరంలోని ఫాతిమా, ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

mp avinash visit covid hospital at kadapa
ఎంపీ అవినాశ్

కడపలోని ఫాతిమా, ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులను ఎంపీ అవినాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు పడకల ఏర్పాట్లు, ఆక్సిజన్ సరఫరా, రోగులకు అందుతున్న వైద్యం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. పీపీఈ కిట్లు ధరించి స్వయంగా కొవిడ్ బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్ బాధితులకు కావలసిన వసతులన్నింటిని కల్పించాలని ఎంపీ వైద్యులను ఆదేశించారు. రోజురోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతన్న దృష్ట్యా.. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details