ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

By

Published : Feb 11, 2020, 7:39 AM IST

భార్య, భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. అభం శుభం తెలియని ఏడాది బిడ్డకు తండ్రి లేకుండా చేసింది. కడప జిల్లా రాజంపేట పట్టణం బోయపాలెంలో శేఖర్ రెడ్డి, కుమారి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన భర్త శేఖర్ రెడ్డి.. ఇంట్లో ప్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

man suicideds at rajampeta in kadapa
భార్యతో ఘర్షణ పడి ఆత్మహత్యకు పాల్పడిన భర్త

భార్యతో ఘర్షణ పడి ఆత్మహత్యకు పాల్పడిన భర్త

ABOUT THE AUTHOR

...view details