ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కట్టుదిట్టంగా లాక్​డౌన్

కడప జిల్లాలో రోడ్లపై ప్రజలను తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ఉదయం 11 గంటల వరకే అనుమతిచ్చారు. రేషన్​ డిపోల వద్ద సామాజిక దూరం పాటించేట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు.

By

Published : Mar 30, 2020, 3:00 PM IST

kadapa district lockdown
కడపలో కొనసాగుతున్న లాక్​డౌన్​

కడపలో కొనసాగుతున్న లాక్​డౌన్​

కడప జల్లాలో లాక్​డౌన్ ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతిచ్చారు. జిల్లా సరిహద్దులను మూసేశారు. ప్రజలు ఎక్కడా రోడ్లపై తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. రేషన్ డిపోల వద్ద ఉదయమే ప్రజలు బారులు తీరారు. వారందరూ సామాజిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. దిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులకు ఇవాళ రిమ్స్​లో కరోనా పరీక్షలు నిర్వహించారు. నమూనాలను తిరుపతికి పంపారు. జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details