లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించకుండా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు కోరారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో ముస్లిం పెద్దలతో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని కోరారు. ఉదయం, సాయంత్రం మసీదులో మైకుల ద్వారా ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. మసీదుల వద్ద గుంపులు గుంపులుగా ఉండి ప్రార్థనలు చేయకూడదని సూచించారు.