ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మసీదులో సామూహిక ప్రార్థనలు చేయకండి'

By

Published : Apr 23, 2020, 8:18 AM IST

లాక్​డౌన్ దృష్ట్యా... రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులు సామూహికంగా మసీదులో ప్రార్థనలు చేయకూడదని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు సూచించారు.

jammalamadugu dsp reacts on ramjan celebrations in kadapa
రంజాన్ వేడుకలపై జమ్మలమడుగు డీఎస్పీ వ్యాఖ్యలు

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించకుండా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు కోరారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో ముస్లిం పెద్దలతో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని కోరారు. ఉదయం, సాయంత్రం మసీదులో మైకుల ద్వారా ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. మసీదుల వద్ద గుంపులు గుంపులుగా ఉండి ప్రార్థనలు చేయకూడదని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details