కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణ శివార్లలోని వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాలలో 300 బెడ్లతో పాటు, 5 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యపు కార్మికులు సహా అవసరమైన సౌకర్యాలను త్వరగా సిద్ధం చేసుకోవాలని స్థానిక అధికారులను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, శిక్షణ ఐఏఎస్ వికాస్ మర్మాట్ ఆదేశించారు.
కోవిడ్ బాధితులకు ఏ చిన్నపాటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం ఆ కళాశాలను వీరివురూ పరిశీలించారు. కళాశాలలో త్వరలోనే పనులు పూర్తిచేస్తామని శ్రీనివాసులు వెల్లడించారు.