చిరు వ్యాపారులు, అనాథలకు భోజనం పంపిణీ
కడప జిల్లా కమలాపురంలో చిరు వ్యాపారులు, అనాథలకు పోలీసులు ఆహారం అందజేశారు. పూట గడవక ఇబ్బంది పడుతున్నవారికి ఆపన్నహస్తం అందించారు.
కడప జిల్లా కమలాపురం పైడిమాన్ కాలనీలో చిరు వ్యాపారాలు చేసుకునేవారు పూట గడవక శుక్రవారం పోలీసుల్ని ఆశ్రయించారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారులు లేక, ఆదాయం రాక తమకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. స్పందించిన ఎస్సై రాజారెడ్డి.. కూరగాయలు, భోజనం అందిస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం స్థానిక వైకాపా నాయకుడు మారుజాళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి భోజనం, నిత్యావసరాలు అందజేశారు. లాక్ డౌన్ కొనసాగినంతకాలం ఆహారం పంపిణీ చేస్తామని పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ వారికి హామీ ఇచ్చారు.
TAGGED:
పేద ప్రజలకు అన్నం పంపిణీ