ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2020, 6:12 PM IST

ETV Bharat / state

1200 జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ

కడప జిల్లాలో కలెక్టర్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అందరం కలసికట్టుగా కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

kadapa district
జర్నలిస్ట్ లకు నిత్యావసర వస్తువులు

కరోనా సమయంలో విలేకరులు చేసిన సేవలు వెలకట్టలేమని కడప కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. కడప జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులకు కలెక్టర్ సహకారంతో ప్రెస్ క్లబ్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ తో మృతి చెందిన ఇద్దరు జర్నలిస్టు లకు మౌనం పాటించారు. మనమందరమూ కలసికట్టుగా కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఎలాంటి సహాయం కావాలన్నా అందజేస్తామని చెప్పారు. సుమారు 1200 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details