ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 20, 2019, 11:45 AM IST

ETV Bharat / state

రైతులకు రాయితీ రుణాలివ్వాలని ఆందోళన

బంగారం తాకట్టుతో వ్యవసాయ సాగుదారులు తీసుకొనే రుణాలపై వడ్డీ రాయితీని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ డిమాండు చేశారు.

'బంగారం తాకట్టుపై రైతులకు రాయితీ రుణాలివ్వండీ'

కడప జిల్లా మైదుకూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదుట రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ.రమణ మాట్లాడుతూ..వ్యవసాయదారులు బంగారు తాకట్టుపై తీసుకునే రుణాలపై రాయితీని కేంద్రం రద్దు చేయడం సరికాదన్నారు. వ్యవసాయ రంగంపై రాయితీల రద్దు తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. వ్యవసాయరంగానికి 18 శాతం రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు నిబంధన పెట్టినా అమలు కాలేదని ఆరోపించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను శాస్త్రీయబద్ధంగా విశ్లేషించి పంట రుణాల్ని పెంచాలని కోరారు. నిజమైన సాగుదారులకు బంగారు తాకట్టు పెట్టి ఇచ్చే వడ్డీ రాయితీని కొనసాగించాలని డిమాండు చేశారు. లేకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు మేనేజర్​కు వినతిపత్రం అందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details