ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 12:45 PM IST

ETV Bharat / state

రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటివద్దకే నిత్యావసరాలు

కడప జిల్లాలో రెడ్ జోన్​గా ప్రకటించిన ప్రాంతాల్లో ఇళ్లవద్దకే కూరగాయలు, నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. వ్యాపారుల సాయంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని... ఫోన్ చేస్తే తామే వచ్చి సరకులు అందిస్తామని చెప్పారు.

daily needs door delivery in kadapa red zone areas
ఇళ్ల వద్దకు నిత్యావసరాలు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్న ఆటోలు

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రెడ్ జోన్​గా ప్రకటించిన ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. కూరగాయల వ్యాపారుల సంఘం సహకారంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా గద్వాల, సిద్ధవటం, మైదుకూరు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లో ఇళ్లవద్దకు తీసుకెళ్లి అందజేస్తున్నారు. నిత్యావసర సరకులు కావలసినవారు 9392302424 నంబరుకు ఫోన్ చేయాలని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details