కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేడు కొనసాగనుంది. అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం 9 గంటలకు నివాళులు అర్పిస్తారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు శంకుస్థాపన చేస్తారు. గండికోట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభిస్తారు.
కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన
కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు పర్యటన కొనసాగనుంది. కీలక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ముందుగా.. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.
Cm Jagan tour in Kadapa district day 2 details
మధ్యాహ్నం 3 గంటలకు ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్లో ఇర్మా ఏపీకి శంకుస్థాపన చేయనున్న సీఎం.. అనంతరం అపాచీ లెదర్ డెవలప్మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. పులివెందులలో వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ లేఅవుట్ పరిశీలిస్తారు. రాత్రికి ఇడుపులపాయలో బస చేస్తారు.
TAGGED:
కడప సీఎం జగన్ పర్యటన