ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వైద్యులు మిస్సింగ్..! - తెలుగు డాక్టర్లు మిస్సింగ్

దిల్లీలో... ఏపీకి చెందిన ఇద్దరు వైద్యులు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 25 నుంచి వీరిద్దరి జాడలేదు. ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్న వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారికేమైనా అపాయం జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

దిల్లీలో ఇద్దరు వైద్యులు మిస్సింగ్
దిల్లీలో ఇద్దరు వైద్యులు మిస్సింగ్

By

Published : Dec 31, 2019, 1:16 PM IST

దిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం కలకలం రేపుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన దిలీప్‌ సత్య ఈ నెల 25 నుంచి కనిపించకుండా పోయారు. దిలీప్‌ సత్య ఛండీగఢ్‌లో పనిచేస్తుండగా... హిమబిందు దిల్లీలోనే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు.

హిమబిందు భర్తకు దిలీప్‌ సత్య మిత్రుడు. ఈనెల 25న వీరువురు చర్చికి వెళ్తున్నట్లు చెప్పారని... ఆ తర్వాత అదృశ్యమైనట్లు హిమబిందు భర్త తెలిపారు. ఐదురోజులుగా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకోలేకపోయారని వివరించారు. వారికి ఏమైనా అపాయం జరిగి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హత్య!

ABOUT THE AUTHOR

...view details