ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2020, 5:07 PM IST

Updated : Jan 26, 2020, 10:35 AM IST

ETV Bharat / state

'అతని చావుకు పోలీసులే కారణమా..?'

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే పురుగుమందు తాగినట్లు చికిత్స సమయంలో బాధితుడు చెప్పిన మాటలను బంధువులు రికార్డ్ చేశారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో నరసింహరావు మృతిచెందాడు.

suicide
suicide

పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డానన్న నరసింహరావు

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపత్రికి చెందిన నరసింహరావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే తాను పురుగుమందు తాగినట్లు చికిత్స సమయంలో చెప్పిన మాటలను బంధువులు రికార్డ్ చేశారు. నరసింహరావు, అతడి భార్య దుర్గాదేవికి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు ఉన్నాయి. భర్తపై పోలీసులకు వారం రోజుల కిందట భార్య ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు నరసింహరావును స్టేషన్​కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు బంధువులకు తెలిపాడు. పోలీసులు కొట్టి అవమానించడం కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. నరసింహరావును ఏలూరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతిచెందాడు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.

Last Updated : Jan 26, 2020, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details