ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి - గండిగూడెంలో రోడ్డు ప్రమాదం న్యూస్

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం గండిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ప్రైవేట్​ పాఠశాల బస్సు ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు బందంచర్లలో విద్యార్థులను ఎక్కించుకుని గండిగూడెం గ్రామానికి చేరుకుంది. అదే సమయంలో కొక్కొండ పార్థు అనే బాలుడు రహదారిపైకి వచ్చాడు. అధిక వేగంతో వచ్చిన బస్సు ప్రమాదవశాత్తు బాలుణ్ని ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి
పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి

By

Published : Jan 24, 2020, 1:23 PM IST

బస్సు ఢీ కొన్న ఘటనలో బాలుడు మృతి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details