పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరారు. అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు సిజేరియన్ చేశారు. అంతకు ముందే ఆమె కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం శాంపిల్ పంపారు. తర్వాత వచ్చిన ఫలితాల్లో పాజిటివ్గా తేలింది. శస్త్ర చికిత్స చేసిన ముగ్గురు వైద్యులను తొమ్మిది మంది నర్సింగ్ సహాయ సిబ్బందిని హోం క్వారంటైన్కు తరలించారు.
గర్భిణీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్కు వైద్యులు
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడం.. కలకలం రేగింది. ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది హోం క్వారంటైన్కు వెళ్లారు.
Pregnant woman tests positive for COVID-19 in west godavari