ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2019, 4:22 PM IST

ETV Bharat / state

తణుకు ఎమ్మెల్యే... లోకేశ్ బినామీ: నాగబాబు

నారా లోకేష్ కు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బినామీ అని నరసాపురం లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి నాగబాబు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

నాగబాబు

నాగబాబు
మంత్రి నారా లోకేష్ కు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బినామీ అని జనసేన నాయకుడు, నరసాపురం లోక్​సభ నియోజకవర్గ పార్టీఅభ్యర్థి నాగబాబు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. రాధాకృష్ణ నిధులు తెచ్చినా ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. గోదావరి నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకు రావాలనే ఆలోచన ఉందని చెప్పారు. నరసాపురం ఎంపీగా తను, తణుకు ఎమ్మెల్యే గా రామారావు గెలుపు తధ్యమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details