ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 16, 2019, 3:24 PM IST

ETV Bharat / state

యువకుడి అత్యాచారం.. మైనర్ ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో ఓ బాలిక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ప్రియుడికి తెలుపగా ఆమెను తిట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

minor suicide in t. narasapuram west godavari district
యువకుడి అత్యాచారం.. మైనర్ ఆత్మహత్య

యువకుడి అత్యాచారం.. మైనర్​ ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో పురుగుల మందు తాగి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కారకులైన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలిక ఈనెల 7న భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన మానికల రాజు అత్యాచారం చేశాడు.

ఆత్మహత్యకు ఉసిగొల్పిన ప్రియుడు

ఈ విషయాన్ని ఆమె ప్రియుడు సుబ్రహ్మణ్యంకు చెప్పింది. అతను ఆమెను తిట్టి.. చెడిపోయావంటూ శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి బాలిక ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పాడు. శీతల పానీయం సేవించిన బాలిక పాఠశాలకు వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఉపాధ్యాయులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి బంధువులకు సమాచారమిచ్చారు. గురువారం బాలిక పరిస్థితి విషమించడం వల్ల గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజు, సుబ్రహ్మణ్యం లను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

విదేశీ ఫలాలు.. ఆరోగ్యానికి సోపానాలు..!

ABOUT THE AUTHOR

...view details