ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి

పోలవరంలో వరద ఉద్ధృతి పెరుగుతుండడం వల్ల అధికారులు ముందస్తు చర్యలు  చేపడుతున్నారు.

By

Published : Jul 30, 2019, 10:33 AM IST

పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి

పోలవరంలో పెరుగుతోన్న వరద ఉద్ధృతి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. వరద మరింత పెరగటంతో... కొత్తూరు కాజ్​వే పైకి వరద నీరు చేరుకుంది. 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి...వాళ్లకు నిత్యావసర వస్తువులూ దొరకని పరిస్థితి నెలకొంది. ముందస్తు చర్యగా రేషన్ బియ్యాన్ని లాంచీల ద్వారా సరఫరా చేయాలని... అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంగళవారానికి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని కేంద్ర జల సంఘం అధికారులు తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details