ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

చదువులతో పాటు క్రీడల్లోను విద్యార్దులు రాణించేందుకు ప్రధానోపాధ్యాయుడు, ఇతర టీచర్లు విద్యార్దులకు సహకరించాలని జూనియర్ కళాశాల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ రావు సూచించారు.

By

Published : Sep 7, 2019, 5:54 PM IST

సమావేశం

విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

చదువుతో పాటు విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని జూనియర్ కళాశాల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ రావు సూచించారు.పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది.జిల్లాలో34ప్రభుత్వ, 14ఎయిడెడ్, 9సాంఘిక సంక్షేమ, 3గిరిజన సంక్షేమ, 162ప్రైవేటు జూనియర్ కళాశాలలు,కేజీబీవీ కాలేజీలో మొత్తం70వేల మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు.ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు కేవలం చదువులకు మాత్రమే పరిమితం అవుతున్నారని తెలిపారు.క్రీడల్లో రాణించే విద్యార్థులను ఆయా కళాశాల ప్రధానోపాధ్యాయులు,పీడీలు సహకరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details