ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 24, 2020, 8:45 PM IST

ETV Bharat / state

ఏలూరులో కొవిడ్ బాధితుడు ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ కొవిడ్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరులో కొవిడ్ బాధితుడు ఆత్మహత్య
ఏలూరులో కొవిడ్ బాధితుడు ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కొవిడ్ ఆస్పత్రిలో ఓ కొవిడ్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకడంతో తలకు తీవ్రగాయమైంది. తీవ్రరక్తస్రావం కావటంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడు నాలుగు రోజుల కిందట ఆశ్రం కొవిడ్ ఆస్పత్రిలో చేరాడు. మృతుడు కరోనా కారణంగా తీవ్ర భయాందోళనలకు గురయ్యేవాడని.. ఆస్పత్రిలోని ఇతర కొవిడ్ బాధితులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆశ్రం ఆస్పత్రిలో ముగ్గురు వ్యక్తులు ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడగా... ముగ్గురూ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆస్పత్రిలో బాధితుల సంఖ్య అధికంగా ఉండటం, సిబ్బంది తక్కువగా ఉండటం, భద్రత కల్పించకపోవడం వంటి కారణాలు ఆత్మహత్యకు ప్రేరెేపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి

మహారాష్ట్ర మాజీ సీఎంకు కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details