పోలవరం నియోజకవర్గంలో వైకాపా నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగన్ను సీఎం చేయాలని నేతలు ప్రజలను కోరారు.
By
Published : Apr 2, 2019, 1:57 PM IST
పోలవరం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులు ప్రచారం
పోలవరం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులు ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోఏలూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కోటగిరి శ్రీధర్, అసెంబ్లీ అభ్యర్థి తెల్లం బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థించారు.జగన్ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. రోడ్ షో ద్వారా ప్రజలతో మాట్లాడుతూ... తెదేపా ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. రాష్ట్రంలో రాజన్న పాలన మరోసారి చూడాలంటే వైకాపాను గెలిపించాలని ప్రజలను కోరారు. జీలుగుమిల్లిలో శ్రీధర్ సమక్షంలో 80 మంది వైకాపాలో చేరారు.