పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. తహసీల్దార్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్న తహసీల్దార్ దంపతులు.. ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో దంపతులిద్దరికీ పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిద్దరిని భీమవరం కొవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో పాటు వీఆర్వోలు, ఇతర అధికారులకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు.
ఆచంట తహసీల్దార్ దంపతులకు కరోనా పాజిటివ్
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట తహసీల్దార్ దంపతులకు కరోనా సోకింది. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో ఇంటికే పరిమితమైన వారు.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష ఫలితాల్లో కొవిడ్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై వారిద్దరినీ భీమవరం కొవిడ్ కేర్ సెంటర్కు తరలించారు.
ఆచంట తహసీల్దార్ కు కరోనా పాజిటివ్