ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2020, 5:27 PM IST

Updated : May 5, 2020, 5:40 PM IST

ETV Bharat / state

చిన్నారులను మింగేసిన చెరువు!

విజయనగరం జిల్లా పెద్ద చెరువు వద్ద విషాదం జరిగింది. నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

చిన్నారులను మింగేసిన చెరువు
చిన్నారులను మింగేసిన చెరువు

విజయనగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని పెద్ద చెరువు మాన్సాస్ భూమిలోని నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

మృతులు నాని (4), దివాకర్ (8), జయరాం (12)లుగా గుర్తించారు. వీరిలో దివాకర్, నాని అన్నదమ్ములు కాగా, జయరాం వీరికి సమీప బంధువు. వీరంతా పట్టణంలోని జొన్నగుడ్డికి చెందిన వారు. చిన్నారుల మృతివిషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి

Last Updated : May 5, 2020, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details