ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరంలో తెదేపా నేతల ర్యాలీ, మానవహారం

By

Published : Jan 3, 2021, 9:22 PM IST

విజయనగరంలో తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. అశోక్ గజపతి రాజుపై మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది.

TDP leaders rally in Vijayanagar
విజయనగరంలో తెదేపా నేతల ర్యాలీ, మానవహారం

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా... విజయనగరంలో తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. అశోక్ బంగ్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మయూరి జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. మయూరి కూడలి వద్ద మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఆందోళన సందర్భంగా పోలీసులకు, తెదేపా శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ABOUT THE AUTHOR

...view details