ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2021, 5:37 PM IST

ETV Bharat / state

'వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి ప్రాణాలు కాపాడాలి'

కొవిడ్ విజృంభిస్తున్నదున ప్రజలందరికీ త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా నేత గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆమె అన్నారు.

tdp
గుమ్మడి సంధ్యారాణి

వ్యాక్సిన్ ఇవ్వకుండా ప్రజలను కరోనాకు బలి చేయొద్దని విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా నేత గుమ్మడి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు ఆసుపత్రులకు వెళ్లి కొవిడ్ బాధితులతో మాట్లాడుతుంటే.. మన రాష్ట్ర సీఎం మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​లో ఆదేశాలు ఇస్తున్నారన్నారు.

కొవిడ్ ఎక్కువ అవుతున్నందు వల్ల ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుపై విచారణ త్వరగా చేయాలని కోరారు. వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి.. వారి ప్రాణాలు కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details