వ్యాక్సిన్ ఇవ్వకుండా ప్రజలను కరోనాకు బలి చేయొద్దని విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా నేత గుమ్మడి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు ఆసుపత్రులకు వెళ్లి కొవిడ్ బాధితులతో మాట్లాడుతుంటే.. మన రాష్ట్ర సీఎం మాత్రమే వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇస్తున్నారన్నారు.
కొవిడ్ ఎక్కువ అవుతున్నందు వల్ల ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుపై విచారణ త్వరగా చేయాలని కోరారు. వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి.. వారి ప్రాణాలు కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.