ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత

కరోనా నియంత్రణకు మేము సైతం అంటూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

By

Published : Aug 2, 2020, 12:10 AM IST

vizianagaram
పార్వతీపురంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసిన దూకాణాలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో అన్ని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. కరోనా నియంత్రణకు మేము సైతం అంటూ 10 రోజుల పాటు దుకాణాలు మూసివేసేందుకు వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధుల అనుమతితో అన్ని వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో రహదారులు బోసిపోయాయి.

పార్వతీపురంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటం వలన అందులో కొంతమంది వ్యాపారస్తులు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవలు, మందుల దుకాణాలు, గ్యాస్, పెట్రోల్ బంకులు తెరిచి ఉంచారు

ఇదీ చదవండి 'కరోనా బాధితులను క్వారంటైన్ సెంటర్​కు తరలించాలి'

ABOUT THE AUTHOR

...view details