ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 7, 2021, 3:32 PM IST

ETV Bharat / state

నిల్చున్నచోటే కుప్పకూలి మృతి చెందిన లారీ డ్రైవర్

తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం లోడును విజయనగరం జిల్లా సాలూరు పెద మార్కెట్​కు తీసుకువచ్చారు. సరకు అన్​లోడ్ చేస్తుండగా లారీ డ్రైవర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడి మృతి చెందాడు.

lorry driver collapsed where he was standing
'లారీ డ్రైవర్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు'

తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం లోడును విజయనగరం జిల్లా సాలూరు పెదమార్కెట్​కు తీసుకువచ్చారు. సరకు అన్​లోడ్ అయితే తిరిగి సొంతూరుకు వెళ్లిపోయేవారు.. కానీ ఎమైందో ఏమో.. ఉన్నచోటే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. సామర్లకోటకు చెందిన లారీ డ్రైవర్​ ఏసబ్బాయి అధికారులు పట్టించుకోకపోవటంతో సుమారు 2 గంటల పాటు మృతదేహం అక్కడే ఉండిపోయింది.

ఎస్​ఐ ఫకృద్ధీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం నుంచి లారీలో బియ్యం లోడుతో డ్రైవర్, క్లీనర్ సాలూరు చేరుకున్నారు. అన్​లోడ్​ అయ్యేలోపు భోజనం చేసి రమ్మని క్లీనర్​ని పంపించాడు. తిరిగి వచ్చేసరికి పడిపోయి ఉన్నాడు. ఎందుకు పడిపోయాడోనని.. లేపే ప్రయత్నం చేయగా.. మృతి చెందినట్లు గుర్తించాడు. దీనిపై పట్టణ పోలీసులకు క్లీనర్ ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులకు ఫోన్​ ద్వారా సమాచారం అందించారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details