ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 12, 2020, 1:27 PM IST

ETV Bharat / state

గ్యాస్ లీక్ బాధితుల వివరాలు సేకరిస్తుండగా.. ముగ్గురికి అస్వస్థత

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితుల గురించి సర్వే చేస్తున్న వాలంటీర్లు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు కళ్లు తిరిగి పడిపోగా వారిని ఆసుపత్రికి తరలించారు.

volunteers getting sick while survey on vizag gas leakage victims
విశాఖ గ్యాస్ లీకేజీ... ముగ్గురు వాలంటీర్లకు అస్వస్థతత

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితుల వివరాలు సేకరిస్తున్న గ్రామ వాలంటీర్లు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీకేజీ ప్రభావం ఉన్న 5 ప్రాంతాల్లో వాలంటీర్లు బాధితుల గురించి సర్వే చేస్తున్నారు.

వారిలో కుసుమ, నూకరత్నం, కనక మహాలక్ష్మీ అనే ముగ్గురు కళ్లు తిరిగి పడిపోయారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details