ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2020, 9:46 AM IST

ETV Bharat / state

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెయ్యి బస్సులు నడుపుతామని ఆర్​ఎం దానం వెల్లడించారు.

special buses
special buses

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆర్​ఎం దానం తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో వెయ్యి బస్సులు నడుపుతామని తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్​కు 109, చెన్నై- 3, విజయవాడ - 250, అమలాపురం, నర్సాపురం, భీమవరం- 13, రాజమహేంద్రవరం-200 , కాకినాడి- 85, నర్సీపట్నం డిపో నుంచి ప్రత్యేకంగా విజయవాడకు 15 బస్సులు నడపనున్నారు.

విజయనగరం , రాజాం, పాలకొండ ,పార్వతీపురం, శ్రీకాకుళం , సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాలకు 325 బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వీటిని ప్రయాణికులు వినియోగించుకోవాలని.. ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details