ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 9:08 PM IST

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్​ డీలర్ల ఆందోళన

రోలుగుంట రేషన్​ డీలర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని డీలర్ల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఇంఛార్జ్​ తహసీల్దార్​ త్రివేణికి వినతి పత్రాన్ని అందజేశారు.

rolugunta ration dealers protest to solve the issues of their association in visakha district
రోలుగుంట రేషన్​ డీలర్ల ఆందోళన

విశాఖ జిల్లా రోలుగుంట మండలం రేషన్​ డీలర్లు ఆందోళన బాటపట్టారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రభుత్వం చేపట్టిన ఉచిత రేషన్​ సరుకుల పంపిణీకి సంబంధించి తాము చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు బీమా సదుపాయం కల్పించాలని కోరారు. ఈ మేరకు మండల ఇంఛార్జ్​ తహసీల్దార్​ త్రివేణికి వినతి పత్రాన్ని అందజేశారు. రేషన్​ డీలర్లకు విధిగా నాణ్యమైన శానిటైజర్​, మాస్కులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details