విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం, పెదనందిపల్లి గ్రామాల్లో రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి.. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు.. ఎస్సై సింహాచలం చెప్పారు.
మరో ఘటనలో... తామరబ్బ సమీపంలోని శారదా నది నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.