ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 28, 2021, 8:16 AM IST

ETV Bharat / state

అక్రమ మద్యం, ఇసుక పట్టివేత.. నలుగురు అరెస్ట్​

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిన రెండు వేరు వేరు ఘటనల్లో.. అక్రమంగా తరలిస్తున్న మద్యం, ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

seized liquor and sand tractors
అక్రమ మద్యం,ఇసుక పట్టివేత.. నలుగురు అరెస్ట్​

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం, పెదనందిపల్లి గ్రామాల్లో రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి.. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు.. ఎస్సై సింహాచలం చెప్పారు.

మరో ఘటనలో... తామరబ్బ సమీపంలోని శారదా నది నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లపై బైండోవర్ ​కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details