ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 12:10 PM IST

Updated : Nov 1, 2020, 2:12 PM IST

ETV Bharat / state

విశాఖలో బాలుడి అపహరణ...గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

Police crack case of boy abduction in Visakhapatnam
విశాఖలో బాలుడి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

12:06 November 01


 విశాఖ గాజువాక ఆటోనగర్‌లో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే ఈకేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఆటోనగర్​లో శనివారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని కొందరు వ్యక్తులు అపహరించారు. రాజస్తాన్‌కు చెందిన నరేష్‌ యాదవ్‌ విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపుతున్నారు. రూ.43 లక్షల అప్పు వ్యవహారమే అపహరణకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. 

బాలుడి తండ్రి నరేష్‌ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఫోన్ నెట్వర్క్ ద్వారా లొకేషన్​ను గుర్తించి... రెండు గంటల్లోనే కేసును ఛేదించారు. వన్ టౌన్ ఏరియాలోని ఓ ఇంటిలో బాలుడిని ఉంచినట్లు కనుగొన్న పోలీసులు... దుండుగుల నుంచి సురక్షితంగా కాపాడారు. కిడ్నాప్ చేసిన 5గురు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

 ఆస్తి కోసం పిన్ని హత్య.. కేసును ఛేదించిన పోలీసులు

Last Updated : Nov 1, 2020, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details