ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 24, 2020, 6:44 PM IST

ETV Bharat / state

ఉద్యమ యోధురాలు చంద్రమ్మకు ఘన నివాళి

శ్రీకాకుళం ఉద్యమ యోధురాలు పైలా చంద్రమ్మకు విశాఖలో విప్లవ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించాయి. అనారోగ్యం కారణంగా కొద్దిరోజుల కిందట విశాఖ కేజీహెచ్​లో చేరిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు.

paid tributes to paila chandramma at vishakapatnam
ఉద్యమ యోధురాలు చంద్రమ్మకు ఘన నివాళి

విప్లవ సంఘాల ఆధ్వర్యంలో... గిరిజన పోరాట యోధురాలు పైలా చంద్రమ్మకు విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. చంద్రమ్మ తన 72 ఏళ్లలో 55 ఏళ్ల జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితమిచ్చారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ప్రజాపంధా, జనశక్తి, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు, అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకురాలుగా ఆమె నిర్వహించిన వివిధ బాధ్యతల్లో అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details