ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 1:52 PM IST

ETV Bharat / state

పోలింగ్ కేంద్రంలో మంత్రి అవంతితో ఓపీఓ సెల్ఫీ

పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రంలో ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.రమణమ్మ.. మంత్రితో కలిసి సెల్ఫీ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

opo selfie with minister avanthi srinivas at vishakapatnam
పోలింగ్ కేంద్రంలో మంత్రి అవంతితో ఓపీఓ సెల్పీ


విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలోని నేరెళ్లవలస 11వ పోలింగ్ కేంద్రంలో.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.రమణమ్మ.. మంత్రితో కలిసి సెల్ఫీ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. రమణమ్మ.. పెందుర్తి మండలం చింతల అగ్రహారం జడ్పీ హైస్కూల్లో​ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఎన్నికల విధుల్లో భాగంగా 11వ పోలింగ్ కేంద్రంలోని జీవీఎంసీ మూడో వార్డులో ఓపీఓగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details