ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 5:56 PM IST

ETV Bharat / state

శారద పీఠానికి కొత్త లోగో రూపకల్పన.. ఆవిష్కరించిన పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదా పీఠంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక రంగంలో నూతన ఒరవడి కోసం కొత్తగా లోగోను స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. విశాఖ శారదా పీఠం మహిమ ప్రపంచమంతా చాటేలా లోగోను రూపొందించినట్లు తెలిపారు.

శారద పీఠానికి కొత్త లోగో రూపకల్పన.. ఆవిష్కరించిన పీఠాధిపతులు
శారద పీఠానికి కొత్త లోగో రూపకల్పన.. ఆవిష్కరించిన పీఠాధిపతులు

విశాఖ శారదాపీఠం నూతన అధ్యాయానికి తెరతీసింది. ఆధ్యాత్మిక రంగంలో సుదీర్ఘ ప్రయాణం సాగించిన పీఠం తొలిసారి ఒక చిహ్నానికి రూపకల్పన చేసింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఈ లోగోను శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. చినముషిడి వాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వేదికగా నిలిచింది.

ఆ సిద్ధాంతానికి అద్దం పట్టేలా..

ఆది శంకరాచార్యుల వారి అద్వైత తత్వానికి అద్దం పట్టేలా లోగోను మలిచినట్లు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. సర్వ మానవాళిలో అద్వైత వేదాంత చింతనను పెంచేందుకు "అద్వైతం సత్యం" అనే నినాదాన్ని విశాఖ శ్రీ శారదా పీఠం విస్తృతంగా ప్రచారం కల్పించబోతోందన్నారు.

లోగోలో వివరణాత్మకంగా..

మానవుడు జీవన్ముక్తిని పొందడానికి సంసార సాగరాన్ని ఎందుకు వీడాలి ? మోక్ష సిద్ధి కోసం ఎటువంటి ప్రయత్నం చేయాలి? తదితర అంశాలపై లోగోలో వివరణాత్మకమైన సందేశం ఇచ్చామన్నారు. విశాఖ శారదా పీఠం మహిమ యావత్ ప్రపంచమంతా చాటేలా లోగోను రూపొందించినట్లు స్వామి స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు.

ఆధ్యాత్మిక భావాలు రేకెత్తించేలా..

జ్ఞానానికి చిహ్నమైన వృక్షాన్ని వృత్తాకారంలో ఎందుకు పొందుపరిచారో స్వామీజీ వివరించారు. లోగోలో శారదా పీఠం అధిష్ఠాన దేవత రాజశ్యామల అమ్మవారి వాహనమైన హంస, పీఠం గురు పరంపరకు ప్రతీకగా నిలిచే రుద్రాక్షలతో లోగో ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక భావాలు రేకెత్తించేలా విలక్షణంగా లోగోను రూపొందించామని పేర్కొన్నారు.

శారద పీఠానికి కొత్త లోగో రూపకల్పన.. ఆవిష్కరించిన పీఠాధిపతులు

ఇవీ చూడండి:

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య!

ABOUT THE AUTHOR

...view details