ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటక హబ్​గా విశాఖ జిల్లా: అవంతి

విశాఖ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేస్తామని ఉద్ఘాటించారు.

By

Published : Jul 7, 2019, 8:36 AM IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖ జిల్లాను ప్రత్యేక పర్యాటక హబ్​గా తీర్చిదిద్దుతామని ఆ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నంలో పర్యటించిన ఆయన..లంబసింగి, తాండవ, కృష్ణదేవిపేట పట్టణాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కృష్ణదేవిపేటలో అల్లూరి స్మారక మందిరాన్ని రూ.50 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటామన్న అవంతి... రాష్ట్ర ప్రయోజనాలకు కృషి చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details