ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2021, 3:39 PM IST

ETV Bharat / state

చీడికాడ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మృతి

విశాఖ జిల్లా చీడికాడ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు జాజిమొగ్గల జగన్నాథం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, వైకాపా శ్రేణులు సంతాపం ప్రకటించారు.

Former Vice President died
మాజీ ఉపాధ్యక్షుడు మృతి

విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు జాజిమొగ్గల జగన్నాథం (70) అనారోగ్యంతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2001 - 06 మధ్య కాలంలో ఆయన మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, వైకాపా శ్రేణులు సంతాపం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details