శాసన మండలి రద్దుకు చంద్రబాబునాయుడే కారణమని మాజీమంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో మాట్లాడుతూ.. సవ్యంగా జరిగే మండలి గ్యాలరీలోకి వెళ్లి ఛైర్మన్ను ప్రభావితం చేసి నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారన్నారు. శాసనసభ చేసే బిల్లులపై సలహాలు ఇవ్వాల్సిన మండలి.. అలా నడుచుకోలేదని విమర్శించారు.
'శాసన మండలి రద్దుకు చంద్రబాబే కారణం'
సీఎం జగన్మోహన్రెడ్డికి శాసన మండలి రద్దు చేసే ఆలోచన లేదన్నారు మాజీమంత్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు అలాంటి తలంపే రాలేదని.. అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు వల్లే ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.
వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు