విశాఖ జిల్లా చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా జల్లి హలియా రాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియా రాణి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆమె భర్త జల్లి సుధాకర్ ప్రస్తుతం అరకు లోక్సభ నియోజకవర్గ వైకాపా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా అరకు ఎమరయ్య నియమితులయ్యారు. మరో 17 మందిని డైరెక్టర్లుగా నియమించారు.