లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని.. విశాఖ జిల్లా పాయకరావు పేట భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నారాయణరావు కోరారు. మేడే సందర్భంగా ఆయన పట్టణంలో జెండా ఎగరవేశారు. కార్మికుల అవస్థపై... కార్మిక సంక్షేమ బోర్డు స్పందించి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'భవన నిర్మాణ రంగ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలి'
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నిబంధనతో భవన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలపై కార్మిక సంక్షేమ బోర్డు దృష్టి సారించి... రూ.10 వేల పరిహారం ఇవ్వాలని పాయకరావుపేట కార్మిక సంఘం అధ్యక్షుడు నారాయణరావు డిమాండ్ చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు