బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ 132 వ జయంతి ఉత్సవాల పోస్టర్ ను... రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రస్ట్, మౌలానా అజాద్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని మంత్రి అన్నారు. ఆజాద్ జయంతిని నవంబర్ 11వ తేదీన నేషనల్ ఎడ్యుకేషన్ డే గా జరుపుకోవడం ఆనందకరమన్నారు. ఈ వేడుకలో జాతీయ స్థాయి వ్యాసరచన, క్విజ్, పోస్టర్ మేకింగ్, ఫోటోగ్రఫీ, షార్ట్ వీడియో మేకింగ్, పెయింటింగ్, కవిత్వం...పోటీలు ఆన్లైన్ లో నిర్వహిస్తారని తెలిపారు.