శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన మోహన్(28) తన స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం సేద తీరటానికి పక్కనే ఉన్న చెరువుకి స్నానానికి దిగారు. అంతలోనే ఆ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులోని మొక్కల మధ్యలో చిక్కుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక బృందం... మోహన్ మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితుడు మృతి చెందడంతో వారంతా షాక్కు గురయ్యారు.
సరదాగా చెరువులోకి దిగి... శవమై తేలాడు
స్నేహితులంతా కలిశారు. సరదాగా క్రికెట్ ఆడారు. బాగా అలసిపోయారు. సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగి అల్లరి చేశారు. అంతలోనే వారిలో ఒకరు నీటిలోని మొక్కల మధ్య చిక్కుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అప్పటి వరకు సరదాగా గడిపిన స్నహితుడు నీటిలో మునిగి మృతి చెందడంతో తోటి స్నేహితుల్లో విషాదం నెలకొంది.
సరదాగా చెరువులోకి దిగి... శవమై తేలాడు