ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సముద్రస్నానానికి వెళ్లి... ముగ్గురు ఉత్తరప్రదేశ్ యువకులు గల్లంతు

By

Published : Mar 29, 2021, 10:09 PM IST

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-మత్స్యలేశం తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన వారిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరు పొట్టకూటికోసం ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకుళానికి వచ్చిన వారని తెలుస్తోంది.

three missing in the sea went to bath
సముద్రస్నానానికి వెళ్లి... ముగ్గురు ఉత్తరప్రదేశ్ యువకులు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా గార మండలంలో విషాదం చోటుచేసుకుంది. కళింగపట్నం-మత్స్యలేశం తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన 8 మందిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాందంలో గల్లంతైన వారు ఉత్తరప్రదేశ్‌ అలంపూర్‌ జిల్లా ఈటీరాంపూర్​కు చెందిన వారని తెలుస్తోంది.

గృహ నిర్మాణంలో సీలింగ్ పనులు చేసే యువకులు... పొట్టకూటికోసం పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకుళానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో 8 మంది సముద్రస్నానానికి వెళ్లారు. వారిలో ఆశిష్ వర్మ (18), చోటు (18), సందీప్ (18) అనే యువకులు గల్లతయ్యారు. వారి కోసం మెరైన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details