మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆహారం పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
చంద్రబాబు పుట్టినరోజున పారిశుద్ధ్య సిబ్బందికి భోజన వితరణ - నరసన్నపేటలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని.. తెదేపా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజుని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పారిశుద్ధ్య సిబ్బందికి ఆహారం పంపిణీ చేశారు.

చంద్రబాబు పుట్టినరోజున పారిశుద్ధ్య సిబ్బంది భోజన వితరణ