సమస్యాత్మక గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసి..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ.. అధికారులనుఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లులో భాగంగా ఆమదాలవలసలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లపైసిబ్బందికి దిశానిర్దేశం చేశారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో డీఎస్పీ... పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆముదాలవలస పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించి..ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.