ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2020, 7:03 PM IST

ETV Bharat / state

'సీఎం జగన్ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి'

సీఎం జగన్ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపడమేమిటని నిలదీశారు.

achennaidu fires on cm jagan on amaravathi issue
అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వర్గంపై కక్ష సాధింపు చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... వాళ్ళకే సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నడిపిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు రాజధాని కట్టమని భూములు ఇస్తే.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు భరోకు పిలుపునిస్తే నాయకులను అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!

ABOUT THE AUTHOR

...view details