అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు కూడా విరామం ప్రకటిస్తూ...అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాదయాత్రకు రెండో రోజూ కూడా విరామం ఏర్పడింది. శనివారం ఉదయం గుడ్లూరు నుంచి యథావిధిగా యాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పోర్లుతుండటంతో అడ్డంకులు ఏర్పాడ్డాయని ఐకాస తెలిపింది. మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ఐకాస నేతలు స్పష్టం చేశారు.
న్యాయస్థానంలోనూ విజయం సాధిస్తాం...