ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ చీరాల పురపాల సంఘ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు.

By

Published : Jul 24, 2019, 6:22 PM IST

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కార్మికులకు కనీసం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని కార్మికసంఘ నేత శామ్యూల్ డిమాండ్ చేశారు. గతంలో సమ్మె చేసినప్పుడు విధుల్లోంచి తొలగించిన 12 మంది సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details