ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు - republicday celebrations in prakasam district

ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

republicday celebrations in prakasam district
ప్రకాశం జిల్లాలో ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

By

Published : Jan 26, 2020, 6:52 PM IST

ప్రకాశం జిల్లాలో ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

71వ గణతంత్ర వేడుకలు ప్రకాశం జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్​లో కలెక్టర్ పోలా భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. అనంతరం ఒంగోలుకే ప్రత్యేకమైన ఒంగోలు గిత్తలను ప్రదర్శించారు. వీటితో పాటు వ్యవసాయ, జల వనరులు, విద్యా, గిరిజన సంక్షేమ శాఖల శకటాలను ప్రదర్శించారు. ఆయా రంగాల్లో చేస్తున్న నూతన విధానాలను తెలిపేలా ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు గంగవరపు వందనం, ప్రకాశం పంతులు గారి మనుమడు పంతులును సత్కరించారు.

అద్దంకిలో గణతంత్ర వేడుకలు

అద్దంకిలో

ప్రకాశం జిల్లా అద్దంకిలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో అధికారులు జెండా ఎగురవేశారు. అద్దంకి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పోలీసులు, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

యర్రగొండపాలెంలో గణతంత్ర వేడుకలు

యర్రగొండపాలెంలో

యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో 71వ గణతంత్ర ఉత్సవాలు వినూత్నంగా జరిగాయి. 300 మంది విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణ ధరించి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా కొలుకుల సెంటర్ నుంచి పుల్లల చెరువు కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలు చేతబట్టి హిందూ, ముస్లిం బాయీ, బాయీ... బోలో భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈద్గా ప్రాంగణంకు ముస్లింలందరూ చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

చీరాలలో గణతంత్ర వేడుకలు

చీరాలలో

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చీరాలలో వైభవంగా జరిగాయి. పట్టణంలోని వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి మువ్వెన్నల జెండాను మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి ఎగురవేశారు.

కంభంలో గణతంత్ర వేడుకలు

కంభంలో

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కంభంలో... తెలుగు సంప్రదాయం, సంస్కృతి అద్దం పట్టేటట్లుగా విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించారు. పలు జానపద గేయాలకు బాలికలు కోలాటం చేస్తూ ఆద్యంతం అహూతులను ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి: రైతు భరోసా కేంద్రం.. అన్నదాతకు వరం..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details