ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాయితీగా ఉంటేనే సమాజంలో గౌరవం

రౌడీషీటర్లు నిజాయితీగా, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఒంగోలు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

By

Published : Jun 7, 2019, 6:56 AM IST

పోలీస్

ప్రకాశం జిల్లా ఒంగోలులో రౌడీషీటర్లకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సమాజంలో నిజాయితీగా, సత్ప్రవర్తనతో ఉంటేనే గౌరవం లభిస్తుందని హితవు పలికారు. చాలామంది తాము ఎలాంటి చెడుపనులు చేయటంలేదని.. పాత కేసులు తమపై ఉన్నందువల్లే తాము రౌడీషీటర్లుగా ముద్రపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబరు నాటికి ఎలాంటి కేసులు లేకుండా.. క్రమశిక్షణతో జీవిస్తే పాత కేసులను ఎత్తివేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

రౌడీషీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

ABOUT THE AUTHOR

...view details